పర్యావరణ కాలుష్యం ::
* భూమిపై నివసించే మానవులకు , మానవేతర జీవులకు , భూమిపై చోటు చేసుకున్న నిర్జీవ పదార్థాలకు హానికలిగించే విధంగా పర్యావరణ సమతుల్యంలో అలజడులు సృష్టించడం అనే దానిని కాలుష్యంగా భావించవచ్చు .
* పర్యావరణ పరిరక్షణ చట్టం ( EPA ) 1986 ప్రకారం జీవ లేదా జీవుల చుట్టూ పరివేష్టితమైన పరిస్థితే పర్యావరణం .
* పర్యావరణంలో కొన్ని అన్య పదార్థాలు ఉండవలసిన గాఢతలకంటే ఎక్కువగా ఉండి తగిన కాల పరిమితిని కలిగి ఉండి మానవుడు , ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించడాన్ని పర్యావరణ కాలుష్యం అంటారు .
* కాలుష్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించ వచ్చు . అవి :
1. సహజ కాలుష్యం - ప్రకృతిలో సహజ ప్రక్రియల వల్ల కలిగేది
2. కృత్రిమ కాలుష్యం - మానవుని కృత్యాల వల్ల కలిగేవి
1. ప్రాథమిక కాలుష్యకాలు : ఇవి ఏ స్థితిలో పర్యావరణంలోకి ప్రవేశిస్తాయో అదే స్థితిలో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి .
2. ద్వితీయ కాలుష్యకాలు : ప్రాధమిక కాలుష్యకాలు మార్పు చెందడం ఫలితంగా ఈ కాలుష్యకాలు ఏర్పడును .
గాలి కాలుష్యం ::
* ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లూహెచ్ ) ప్రకారం గాలిలో ఉండే భౌతిక , రసాయన జీవ సంబంధ కారకాలు పరిమితికి మించితే గాలి సహజత్వంలో మార్పులు కలిగి మానవునికి , పర్యావరణానికి హాని కలగడమే వాయు కాలుష్యం .
ప్రాథమికమైన గాలి కాలుష్య కారకాలు ::
1. కార్బన్ మోనాక్సైడ్ ( CO )
2. హైడ్రో కార్బన్లు ( HC )
3. నైట్రోజన్ ఆక్సైడ్లు ( NOx )
4. సల్ఫర్ డై ఆక్సైడ్లు ( SO2 )
* వాయు కాలుష్యం వల్ల ప్రాణులకే కాకుండా ప్రాచీన కట్టడాలను , శిల్పకళాఖండాలకు నష్టం వాటిల్లుతుంది .
కార్బన్ మోనాక్సైడ్ ( CO ) ::
* ఇది విషవాయువు . ఇంధనాలు , కర్బన సమ్మేళనాలు పాక్షికంగా దహనం చెందడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది .
* మొక్కలు కార్బన్ మోనాక్సైడ్ను గ్రహించి ప్రోటీన్లను తయారు చేసుకోవడం మూలంగా -అవి కొంత కాలుష్యాన్ని తగ్గించ గలుగుతున్నాయి .
* కార్బన్ మోనాక్సైడ్ మానవులకు హాని కలిగిస్తుంది . ఇది రక్తములోనికి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది .
* కార్బన్ మోనాక్సైడ్కి రంగు , రుచి , వాసన లేని మండే వాయువు .
* కార్బన్ మోనాక్సైడ్ వాహన ఉద్ఘారాల నుండి అత్యధిక స్థాయిలో విడుదలవుతుంది . దీని జీవిత కాలం 3 సంవత్సరాలు .
* వాయు కాలుష్యంలో ఇది 50 % ప్రమాదకర కాలుష్యంగా పరిగణించబడుతుంది .
సల్ఫర్ డై ఆక్సైడ్ ( SO2) ::
* కార్బన్ మోనాక్సైడ్ తరువాత అత్యధిక మోతాదులో విడుదలయ్యే గాలి కాలుష్య కారకం సల్ఫర్ డై ఆక్సైడ్ .
* థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి సల్ఫర్ డై ఆక్సైడ్ అధికంగా విడుదల అవుతుంది .
* SO2 జీవిత కాలం 2-4 రోజులు . SO2 ప్రభావం ద్వారా మొక్కల్లో పత్రహరిత నష్టం ( క్లోరోసిస్ ) సంభవిస్తుంది .
* మనిషి కంటిలో దురద , ఆస్తమా , బ్రాంకైటీస్ , SO2 వల్ల సంభవిస్తాయి .
* సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యం వలన ఆమ్ల వర్షాలు ఏర్పడతాయి .
* సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్య ప్రభావం వలన చారిత్రాత్మక కట్టడాలు కూడా కళావిహీనం అయిపోతున్నాయి .
* ప్రపంచంలో అత్యధికంగా SO2 ను విడుదల చేస్తున్న దేశం ' ఇండియా '.
నైట్రోజన్ ఆక్సైడ్ ( NO2 ) ::
* బొగ్గు , చమురు , సహజ వాయువులు మొదలగు శిలాజ ఇంధనాలు పరిశ్రమలలో వాహనాలలో , దహింపబడటం వలన నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలై గాలిని కలుషితం చేస్తున్నాయి.
* నత్రజని ఎరువుల వాడకం ద్వారా వాహనాల పొగలో పరిశ్రమల నుండి నత్రజని ఆక్సైడ్లు విడుదలవుతాయి .
* ఇది ద్వితీయ కాలుష్య కారకాలు .
* నత్రజని ఆక్సైడ్లు , సల్ఫర్ ఆక్సైడ్లు వాతావరణంలోకి చేరి , ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతాయి .
హైడ్రోకార్టన్లు ( HC ) ::
* హైడ్రోజన్ , కార్బన్తో నిర్మితమైన సమ్మేళనాలను హైడ్రోకార్బన్స్ అంటారు .
* ఇవి వాహనాలలో వాడినప్పుడు అసంపూర్ణ దహనం వల్ల వెలువడుతుంది .
కార్టన్ డై ఆక్సైడ్ ( CO2 ) ::
* శిలాజ ఇంధనాల వాడకం వల్ల ( CO2 ) వాతావరణంలోకి విడుదలవుతుంది . ( CO2 ) ప్రధాన గ్రీన్ హౌస్ వాయువుగా వ్యవహరించి సూర్యరశ్మిలో శక్తిని గ్రహించి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది .
* ( CO2 ) తోపాటు మిథేన్ ( CH4 ) , క్లోరోఫ్లోరో కార్బన్లు , నైట్రస్ ఆక్సైడ్ , హైడ్రోప్లోరో కార్బన్లు ( HFC ) మరియు సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ ( SF2 ) గ్రీన్ హౌస్ వాయువులుగా వ్యవహరిస్తారు.
* క్లోరోఫ్లోరో కార్బన్స్ ( CFC's ) లు ఏసీల నుండి విడుదలై వాతావరణంలో కొన్ని సంవత్సరాలు ఉండి స్ట్రాటోస్పియర్కు హాని చేసే వాయువులు ఫలితంగా ఓజోన్ మందం తగ్గును.
* పరిశ్రమల నుండి మెర్క్యురీ , కాడ్మియం , పెట్రోల్ దహనం వల్ల లెడ్ వాతావరణం లోకి విడుదలగును . నగరాలలో వాయు కాలుష్యానికి కారణమయ్యేది లెడ్ ( సీసం ) .
* పొగ మంచు ఆమ్ల స్వభావాన్ని కలిగి క్షయీ కరణ ధర్మాన్ని కలిగి ఉండటం వల్ల దీన్ని క్షయీకరణ పొగమంచు అంటారు . అస్బెస్టాస్ పీల్చుకోవడం వల్ల ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి .
* కార్బన్ మోనాక్సైడ్ - రక్త ప్రసరణ వ్యవస్థ.
* నైట్రోజన్ డయాక్సైడ్ - ఎంఫిసియా వ్యాధి.
* పొగమంచు - ముక్కు , కంటి సమస్యలు కార్బన్ డై ఆక్సైడ్ - గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సల్ఫర్ డై ఆక్సైడ్- రాతి కట్టడాలు శిథిలం అవుతాయి .
* కాడ్మియం - హృదయంపై ప్రభావం చూపును .
* లెడ్ - మెదడు , మూత్రపిండాలు దెబ్బతినడం.
* పాదరసం - నాడీ సంబంధిత సమస్యలు.
* దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ఒక జాతీయ కాలుష్య సూచిక అనివార్యమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6 న జాతీయ వాయుకాలుష్య సూచిక ( National Air Quality Index , AQI ) ను ప్రారంభించింది .
* World Health Organisation ( WHO ) ప్రకారం ప్రపంచంలోనే 20 మొదటి అత్యంత కాలుష్య నగరాల్లో 13 నగరాలు భారత్లోనే ఉన్నట్లు గుర్తించారు .
* జాతీయ కాలుష్య సూచిక ప్రకారం 8 కాలుష్యకాలను సూచిస్తుంది . అవి : ఓజోన్ ( Particular Ematter ( PM2.5 ) , PM10 . నైట్రోజన్ డై ఆక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ , సల్ఫర్ డై ఆక్సైడ్ , లెడ్ , అమోనియా .
* మన దేశంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి 2020 ఏప్రిల్ 1 నుండి జాతీయ స్థాయిలో BS ( Bharath Stage ) -VI_ ను వాడుతున్నారు .
* భోపాల్ దుర్ఘటన : ఇది డిసెంబర్ 2 , 1984 లో రాత్రి లేదా డిసెంబర్ 3 న తెల్లవారు జామున మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే పెస్టిసైడ్ తయారీ కంపెనీలో మిథైల్ ఐసో సయనేట్ అనే వాయువు విడుదలైంది . ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్ర పారిశ్రామిక దుర్ఘటన . ఈ దుర్ఘటన ఫలితంగా 1986 లో పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకురావడమైనది .
జలకాలుష్యం ::
* డబ్ల్యూహెచ్ వారి ప్రకారం ప్రస్తుతం లేదా భవిష్యత్లో మానవుడు తన అవసరాలు అన్నింటికీ ఉపయోగించుకోవడానికి పనికి రాని , కనీస నాణ్యత లేని నీటిని కలుషిత నీరు అంటారు .
* అవాంఛిత కారకాలు నీటిలో చేరడం వల్ల నీటి యొక్క భౌతిక , రసాయన , జీవ సంబంధ స్థితులు మారడాన్ని నీటి కాలుష్యం అంటారు .
* గాలి కాలుష్యం తరువాత పేర్కొనదగిన ప్రమాదకరమైన కాలుష్యం నీటిదే .
* మన దేశంలో నదులు , సరస్సులు చాలా వరకు కలుషితమైపోయాయి . త్రాగడానికి పనికిరాకపోగా నీటి నుండి ఎన్నో వ్యాధులను కలిగించేవిగా పరిణమిస్తున్నాయి .
* ఆర్సెనిక్ , ఫ్లోరైడ్ , నైట్రేట్ల వంటి వానిలో కలుషితమైన భూగర్భ జలం అతి ప్రమాద కరంగా తయారవుతున్నాయి .
* మురుగు : నగరాల్లో , పట్టణాల్లో గృహ సంబంధ ముగురు పదార్థాలు నీటిలో చేరిపోవటం వలన ఇది ఏర్పడుతుంది .
* కలుషితమైన నీటిలోని మిథైల్ మెర్క్యురితో కలుషితమైన చేపల ఆహారాన్ని స్వీకరించడం వల్ల వారికి ' మినిమాటా ' వ్యాధి సోకింది ( జపాన్లో ).
* జపాన్లోనే కాడ్మియంతో కలుషితమైన వరి ఆహారం తీసుకున్న కారణంగా ' ఇటాయ్- ఇటాయ్ ' అనే వ్యాధి సోకింది .
* త్రాగునీటిలో అధిక నైట్రేట్ ఉన్న కారణంగా ' మిథేయోగ్లోబినేమియా ( బ్లూ బేబీ సిండ్రోమ్ ) ' వ్యాధి సంక్రమిస్తుంది .
* త్రాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటే దంతాలు , ఎముకలు క్షీణించిపోయే ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది .
* భారతదేశంలో 85 % మంది మురికి నీటిని త్రాగుతున్నారు .
* పారిశ్రామిక కాలుష్యం ద్వారా మంచి నీరు కాలుష్యం చెందుతుంది . పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన , అకర్బన రసాయనాలు వెలువడి నీటిని కలుషితం చేస్తున్నాయి .
* చమురు నీటి ఉపరితలంపైన ఉన్న చమురు గాలి నుంచి ఆక్సిజన్ను నీటిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది . ఫ్లవకాల పెరుగుదలలో అడ్డు ఏర్పడుతుంది .
* కలుషితమైన నీటిలో ఆక్సిజన్ తగ్గించే చర్యనే యూట్రోఫికేషన్ " అంటారు .
* గంగానది కాలుష్యాన్ని తగ్గించడానికి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గంగా యాక్షన్ ప్లాన్ పేరిట వెయ్యి కోట్ల రూపాయలతో హరిద్వార్ నుండి కలకత్తా వరకు గంగా జలాలను శుద్ధిచేసే కార్యక్రమాన్ని చేపట్టారు .
* నీటిలో ఫ్లోరిన్ శాతం 1.5 పీపీఎం దాటినప్పుడు మానవులకు ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది .
* కొలిఫాం ఎక్కువగా ఉండటం మానవ వ్యర్థాలు అధికంగా నీటిలో ఉన్నాయనడానికి సూచిక . గంగానది అత్యధిక కాలుష్యానికి కారణం .
* నీటిలో కరిగి ఉన్న ఆక్సిజనన్ను ' విలీన ఆక్సిజన్ ' అంటారు . ఇది సాధారణంగా 5 పీపీఎం కంటే ఎక్కువగా ఉండాలి . 5 పీపీఎం కంటే తగ్గితే నీటిలో చేపలు జీవించలేవు .
* క్లోరినేషన్ : నీటికి క్లోరిన్ వాయువును లేదా బ్లీచింగ్ పౌడర్ను కలిపి సూక్ష్మజీవులను , ముఖ్యంగా బాక్టీరియాను తొలగించడం .
* ఓజోనైజేషన్ : నీటిలో తేలియాడే ఘణరూప రేణువులను ఓజోన్ ను కలిపి తొలగించడం .
నేల కాలుష్యం ::
* వివిధ రకాలైన వ్యర్ధ పదార్థాలు భూమిలోకి చేరడం వలన నేల తన యొక్క సహజ లక్షణాలను కోల్పోయే ప్రమాదముంది . దీనినే నేల కాలుష్యం అంటారు .
* వ్యర్థ పదార్థాలు చేరడం వల్ల భూమి కొంత వరకు తట్టుకోగలుగుతుంది . కాని ప్రతిరోజు అదే పనిగా వ్యర్థాలను చేర్చడం వలన అది కాలుష్యానికి దారి తీస్తుంది .
* అధిక ఆహార ఉత్పత్తి కొరకు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు . దీని ఫలితంగా నేల కాలుష్యం ఏర్పడుతుంది .
* పెట్రోలియం శుద్ధి కర్మాగారాలలోని వ్యర్థ పదార్థాల వలన కూడా నేల కలుషితం అవుతుంది.
* నేల కాలుష్యం పారిశ్రామిక వ్యర్థాలు , నగర , పురపాలక వ్యర్థాలు , వ్యవసాయ వ్యర్థాలు రేడియోధార్మిక పదార్థాలు , ఆమ్ల వర్షాలు , గనుల తవ్వకం , జీవసంబంధ కారకాల వల్ల కాలుష్యం అగును .
* కలుషితమైన నేలను శుభ్రం చేయడానికి కొన్ని ప్రత్యేక మొక్కలు పెంచాలి . దీనిని ' ఫైటో రెమిడియేషన్ ' అంటారు .
* జీవవిచ్ఛిన్నం చెందే సేంద్రియ పదార్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి .
ధ్వని కాలుష్యం ::
* కంపించే వస్తువుల ఉపరితలం నుండి వెలువడే యాంత్రిక శక్తిని ' ధ్వని ' అంటారు .
* కాని సమయంలో , అవాంఛిత ప్రదేశంలో , అసమ్మతమైన , శ్రావ్యయోగ్యం కాని ధ్వనుల వల్ల జీవుల ఆరోగ్యానికి హానికలగడాన్ని " ధ్వని కాలుష్యం " అంటారు .
* ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం - ' డెసిబెల్ ' ( db ) .
* WHO ప్రకారం పరిశ్రమల నుండి వెలువడే ధ్వని తీవ్రతకు అవధి 75 ( db ) గా పేర్కొంటారు . రవాణాకు సంబంధించిన వాహనాల వల్ల అధిక ధ్వని కాలుష్యం కలుగుతోంది .
* ప్రపంచం అత్యధిక ధ్వని కాలుష్యం గల పట్టణం - గాంగ్జూ ( చైనా ).
* ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని మార్చి 3 న జరుపుకుంటారు . పరిశ్రమలలో పనిచేసే వారిలో ఎక్కువ మందికి శాశ్వత చెవిటితనం రావడాన్ని - " ఆక్యుపేషనల్ హియరింగ్ లాస్ " అని అంటారు.
* ధ్వని కాలుష్య ప్రభావానికి సంబంధించి వాయు కాలుష్య ( నివారణ - నియంత్రణ ) చట్టం -1974 మరియు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986 లో ప్రవేశపెట్టింది .
* 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం “ ది నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ " అనే నియమాన్ని రూపొందించారు .
* నిశ్శబ్ధ ప్రాంతాలు ( Silent Zones ) అనగా పాఠశాలలు , కళాశాలలు , హాస్పిటల్స్ మరియు కోర్టులకు 100 మీటర్ల లోపు గల ప్రాంతాలు .
* కేంద్ర ప్రభుత్వం 2011 లో Ambient Noise Monitering Network ను తీసుకొచ్చింది .
ప్రపంచ పర్యావరణ ప్రమాదాలు ::
* నీటి ఉష్ణోగ్రత పెరిగిన కొలది D.O. ( Dissolved Oxygen ) విలువలు తగ్గిపోతాయి . ఉదా : 32 ° F వద్ద నీటిలో D.O. విలువ 14.6 పీపీఎం ఉండగా 64 ° F వద్ద 6.6 పీపీఎంకు తగ్గిపోతుంది .
* రేడియోధార్మిక పదార్థాల వల్ల గాలి . నీటితో పాటు ఇతర ప్రాంతాలు కలుషితం అవుతాయి . ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు .
1. అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
2. యురేనియం , థోరియం వంటి ఖనిజాల వెలికితీత
3. అణువ్యర్థాల రవాణా
4. రేడియోధార్మిక రసాయనాలు వెదజల్లడం
5. రేడియో ఐసోటోప్స్ వాడకం
6. అణు ఆయుధాలు వాడడం
* ప్రపంచంలో మొదటగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై ఆగస్టు 6 న 1945 లో లిటిల్ భాయ్ అనే యురేనియం అణు బాంబును వేసింది . ఆగస్టు 9 న నాగసాకిపై ‘ ఫాట్మాస్ ' అనే ప్లుటోనియం అణుబాంబును వేసింది .
* బ్రిటీష్ అటామిక్ బాంబు ప్రాజెక్టు దుర్ఘటన ( 1957 ) ఇది బ్రిటన్లో ని సెల్లపీల్డ్ లో గల అణుబాంబు ప్రాజెక్టులో మంటలు చెలరేగడం వల్ల అత్యధికంగా రేడియో థార్మిక వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదల అయినవి . త్రీమైల్ దీవి దుర్ఘటన ( 1979 ) ఇది అమెరికాలో జరిగిన అణు దుర్ఘటన .
* చెర్నోబిల్ అణు దుర్ఘటన ( 1986 ) ఇది ఉక్రెయిన్ రేడియోధార్మిక పదార్థాల వల్ల జరిగిన అణు దుర్ఘటన .
* పుకుషిమా దైచీ అణు విస్పోటం ( జపాన్ ) ఇది ప్రకృతి అంశమైన సునామీ వల్ల 2011 మార్చి 11 న సంభవించింది .
* 5 ఎంఎం కన్నా తక్కువ పొడవు గల ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్ అంటారు . వీటి వల్ల కలిగే కాలుష్యాన్ని ' మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ’ అంటారు . ఇది ఎక్కువగా సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉంటుంది .
* ఐక్యరాజ్యసమితి 2017 లో ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటం చేసేందుకు ' క్లీన్ నీ క్యాంపెయిన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది .
* ఇండోనేషియా బాలీ సముద్ర వ్యర్థాల కారణంగా గార్బేజ్ ఎమర్జెన్సీని విధించింది .
* ప్రపంచంలో సముద్ర వ్యర్థాలను అధికంగా విడుదల చేస్తున్న మొదటి దేశం చైనా కాగా , రెండవ దేశం ఇండియా .
* సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం తెలుపురంగు ఇచ్చిన పరిశ్రమలు కాలుష్యరహితం . వీటి ఏర్పాటుకు ఎటువంటి పర్యావరణ అనుమతి అవసరం లేదు .
* హీలీ ఫర్ రివర్స్ ( నదుల కోసం యాత్ర ) . దీనిని ఈశా ఫౌండేషన్ ( జగ్గీవాసుదేవ్ ) ప్రారంభించారు . నదులను రక్షించడం కోసం . కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు యాత్ర చేశారు .
ఘన వ్యర్థ పదార్థాలు - నిర్వహణ ::
* ఆధునిక కాలంలో మనిషి అభివృద్ధి చర్యల ద్వారా అధికమొత్తంలో ఘనవ్యర్ధం విడుదల అవుతోంది .
* ఫ్యాకింగ్ పదార్థాల ఉత్పాదన మరింత దీనికి కారణమవుతోంది . సరైన రీతిలో నియంత్రించకపోవడం వల్లే ఘన వ్యర్థ పదార్ధ సమస్యలు పెరుగుతున్నాయి .
* ఘనవ్యర్ధ పదార్థాలు ఎక్కువైతే తాగునీటి సరఫరాలో హానికర రసాయనాలు కలుస్తాయి . దీంతో కలుషిత నీటిని తాగడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయి .
లాండ్ ఫిల్లింగ్ ::
* ఘన వ్యర్ధ నిర్వహణలో వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు . ఈ విధానంలో నేలలో గోతులు తవ్వి ప్రతి రెండు మట్టి పొరల మధ్య చెత్తపొరను వేసి కాంపాక్టింగ్ చేస్తారు .
* కంపోస్టింగ్ : పశువుల పేడ , ఆహార వ్యర్థాన్ని పోగుచేసి వినియోగం చెందించడమే కంపోస్టింగ్ . దీనిని సేంద్రియ ఎరువు అంటారు.
* ఇన్సినరేషన్ : ఘన వ్యర్థాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ సమక్షంలో మండించి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తారు . ఈ విధానం ద్వారా ఘనవ్యర్థ పరిమాణాన్ని బాగా తగ్గించవచ్చు .
* రీసైక్లింగ్ : వినియోగించిన నిరర్ధక వ్యర్థాల నుండి తిరిగి మనిషి ఉపయోగించే సరికొత్త పదార్థాల తయారీని ' రీసైక్లింగ్ ' అంటారు .
* హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు దాదాపు 1500 టన్నుల చెత్త వెలువడుతుంది . దీని నుండి 200 టన్నుల చెత్త నుండి విద్యుత్ను తయారు చేసే యూనిట్స్ను షాద్నగర్లో నెలకొల్పడం జరిగింది .
ప్రకృతి వనరులు ::
మానవుడు ఈ భూమిపై పుట్టక ముందే ప్రకృతి వృక్ష , జంతు జాలాలను సృష్టించింది . జీవావరణంలో ఉన్న జీవులన్నీ ప్రకృతి వనరుల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి . జీవుల మనుగడకు ముఖ్యంగా కాలవసినవి గాలి , నీరు , ఆహారం ఇవి ప్రకృతిలో లభిస్తాయి . కాబట్టి వీటిని ప్రకృతి వనరులు ( Natural Resources ) అంటారు .